
మాదాపూర్, వెలుగు: మాదాపూర్అయ్యప్ప సొసైటీలో ఏర్పాటు చేసిన ఫిన్వేస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణ రీజనల్ఆఫీసును సీఓడబ్ల్యూఐ నేషనల్ ప్రెసిడెంట్ లలిత, ఇండియన్ పారా బ్యాడ్మింటన్ప్లేయర్మానషి జోషి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా వ్యాపారులకు ఈజీగా లోన్లు ఇచ్చి వారి ఆర్థిక అభివృద్ధికి ఫిన్వేస్కో క్యాపాటల్ఇండియా కృషి చేస్తుందన్నారు. ఫిన్వేస్కో దేశాభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు. ఫిన్వేస్కో హోల్డింగ్స్ఎండీ రవీంద్ర, డైరెక్టర్లు రాకేశ్, రమణ, వెంకట రంగయ్య, కంపెనీ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.