ఫుడ్ ఇన్​స్పెక్టర్ ఫ్లాట్​లో అగ్ని ప్రమాదం

ఫుడ్ ఇన్​స్పెక్టర్ ఫ్లాట్​లో అగ్ని ప్రమాదం

అల్వాల్, వెలుగు: అల్వాల్​పరిధి మచ్చబొల్లారంలోని వీబీసీటీ కమ్యూనిటీ అపార్ట్​మెంట్​లోని ఐదో ఫ్లోర్​లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. జీహెచ్ఎంసీలో ఫుడ్​ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్న లక్ష్మీకాంత్ ఫ్లాట్​లో మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేరు. స్థానికులు గుర్తించి లక్ష్మీకాంత్ కు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్​సిబ్బంది వచ్చి తాళం పగలగొట్టి మంటలను ఆర్పారు. 

ఈ ప్రమాదంలో రూ. 20లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. బిల్డర్ రూల్స్​ పాటించకుండా ఫ్లాట్లు కట్టాడని, సెట్ బ్యాక్​లేకుండా, ఫైర్ సేఫ్టీ లేకుండా నిర్మించాడని బాధితులు వాపోయారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.