అల్వాల్, వెలుగు: అల్వాల్పరిధి మచ్చబొల్లారంలోని వీబీసీటీ కమ్యూనిటీ అపార్ట్మెంట్లోని ఐదో ఫ్లోర్లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. జీహెచ్ఎంసీలో ఫుడ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న లక్ష్మీకాంత్ ఫ్లాట్లో మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేరు. స్థానికులు గుర్తించి లక్ష్మీకాంత్ కు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్సిబ్బంది వచ్చి తాళం పగలగొట్టి మంటలను ఆర్పారు.
ఈ ప్రమాదంలో రూ. 20లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. బిల్డర్ రూల్స్ పాటించకుండా ఫ్లాట్లు కట్టాడని, సెట్ బ్యాక్లేకుండా, ఫైర్ సేఫ్టీ లేకుండా నిర్మించాడని బాధితులు వాపోయారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.