
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణం అశోక్ నగర్ వద్ద ఉన్న పిస్తాహౌస్ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం (జూన్ 6) మధ్యా్హ్నాం పిస్తా హౌస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. హూటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపు చేశారు.
ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో హోటల్ సిబ్బంది, అధికారులు, స్థానికులు ఊపిరీ పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఎంతమేర జరిగిందన్నది తెలియాల్సి ఉంది. హోటల్లో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.