తెలంగాణ భవన్: ఎమ్మెల్సీ గెలుపు సంబురాల్లో అపశృతి

తెలంగాణ భవన్: ఎమ్మెల్సీ గెలుపు సంబురాల్లో అపశృతి

హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించింది. దీంతో తెలంగాణ భవన్ లో ఆ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా స్వీట్లు పంచడంతో పాటు పటాకులు కాల్చారు. అయితే సంబురాల్లో అపశృతి ఏర్పడింది. పటాకులు కలుస్తుండగా పక్కనే ఉన్న పందిరికి మంటలు అంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో అలర్టైన ఆ పార్టీ కార్యకర్తలు వాటర్ పైపులతో  మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.