
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టు ఆవరణలో నిర్మాణంలో ఉన్న ‘అమర్ రాజా’ బ్యాటరీల కంపెనీ బిల్డింగ్లో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 150 కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడో అంతస్తుకు వ్యాపించాయి. దీంతో కార్మికులు బయటికి పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎంత మేరకు నష్టం జరిగిందో, ప్రమాదానికి కారణం ఏమిటో తెలియాల్సి ఉంది.