హైదరాబాద్లోని లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో రైలు స్టేషన్లో ఉండడం, రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
మంగళవారం ఉదయం 6.15 గంటలకు లింగంపల్లిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు విశాఖకు బయలుదేరింది. సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో తూర్పుగోదావరి తుని స్టేషన్ వద్దకు చేరినప్పుడు రైలులో మంటలు వచ్చాయి. ఏసీ బోగీ సీ-3లో మంటలు రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలు ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా గమ్యానికి చేరుకున్నారు.