కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం కార్తికేయ కామాక్షి కెమికల్‌ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు పేలడంతో మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నంతగా ఎగసి పడ్డాయి. కొద్ది నిమిషాల్లోనే మంటలు బిల్డింగ్ మొత్తాన్ని చుట్టుముట్టాయి. భారీగా పేలుడు శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

భారీగా ఆస్తి నష్టం

ప్యాక్టరీలో మంటలు అంటుకున్నాయని స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటీన  ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. సిబ్బంది వేగంగా మంటలు ఆర్పేశారు. అగ్ని ప్రమాదం ఉదయాన్ని జరగడం వల్ల కార్మికులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికీ ప్రాణ నష్టం జరలేదని తెలుస్తోంది. అయితే భారీగానే ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం.