కాకినాడ ఆర్టీసీ బస్సులో మంటలు..

కాకినాడ ఆర్టీసీ బస్సులో మంటలు..

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పెను ప్రమాదం తప్పింది.  కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.