సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడిదల మండలం బొంతపల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది. పారిశ్రామికవాడలోని డ్రమ్ముల గోడౌన్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఐదు ఫైరింజన్లతో సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.