స్కూల్లో అగ్ని ప్రమాదం.. పక్క బిల్డింగ్‌పైకి దూకిన విద్యార్థులు

స్కూల్లో అగ్ని ప్రమాదం.. పక్క బిల్డింగ్‌పైకి దూకిన విద్యార్థులు

లాక్‌డౌన్ తర్వాత స్కూల్స్ ప్రారంభమైన నాలుగోరోజే ఓ స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్ పాతబస్తీ గౌలిపురాలోని శ్రీనివాస హైస్కూల్లో ఒక్కసారిగా మంటలొచ్చాయి. దాంతో స్కూల్ ఆఫీస్ రూమ్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో స్కూల్లో 40 మంది విద్యార్థులున్నారు. మంటలను చూసి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. రెండో అంతస్తు నుంచి స్టూడెంట్స్ పక్క బిల్డింగులపైకి దూకారు. షాట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్కూల్ యాజమాన్యం సమాచారమివ్వడంతో.. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో స్కూల్ యాజమాన్యం, పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

For More News..

సామాన్యునికి షాక్.. వంట గ్యాస్‌పై రూ. 25 పెంపు

ప్రపంచంలోనే తొలిసారిగా రెండు చేతులు, ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్

రేషన్ షాపుల్లోనే ఆధార్-ఫోన్ నెంబర్ లింకింగ్