వనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. మహిళ సజీవ దహనం

వనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. మహిళ సజీవ దహనం

హైదరాబాద్ వనస్థలిపురం FCI కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంటి రెండో అంతస్థులో లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సరస్వతి అనే మహిళ సజీవదహనమైంది. ఆమె భర్తతో పాటు ఇద్దరు పిల్లలను స్థానికులు కాపాడారు. మృతురాలిది నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం తమ్మెడపల్లి. అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.