తిరుమల శ్రీవారి ఆలయంలో అగ్నిప్రమాదం

తిరుమల శ్రీవారి ఆలయంలో అగ్నిప్రమాదం

తిరుమల శ్రీవారి ఆలయంలోని వకులా మాత పోటులో ఇవాళ(గురువారం)  అగ్నిప్రమాదం జరిగింది. గోనెసంచులకు మంటలు అంటుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు TTD అధికారులు తెలిపారు. నెయ్యితో ఉన్న గోనెసంచులు కావడంతో మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది, పోటు కార్మికులు మంటలు ఆర్పివేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది.