
- షార్ట్ సర్క్యూట్తో 50 ఇండ్లలో కాలిపోయిన సామాగ్రి
- మంత్రి కేటీఆర్ ఆదేశించాకే వచ్చిన ఫైర్ సిబ్బంది
సికింద్రాబాద్,వెలుగు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు లేచి మరో 50 ఇండ్లలో వస్తువులు కాలిపోయిన ఘటన సికింద్రాబాద్ పరిధి సీతాఫల్మండి మేడిబావి లో గురువారం రాత్రి జరిగింది. అగ్ని ప్రమాదంపై వెంటనే అగ్ని మాపక సిబ్బంది, పోలీసులకు ఫోన్చేసినా చెప్పినా ఎవరూ స్పందించ లేదు. మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో ట్వీట్చేయగా, ఆయన ఆదేశాలతో అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. గంటపాటు మంటలు అంటుకుని కాలనీలోని 50 ఇండ్లలోని ఫ్రిజ్లు, ల్యాప్టాప్లు , టీవీలు తదితర ఎలక్ర్టానిక్ వస్తువులు కాలిపోయాయి. కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ట్రాన్స్ఫార్మర్ను సరిగా అమర్చకపోవడంతోనే షార్ట్ సర్క్యూట్ జరిగిందని స్థానికులు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని, బాధ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇండ్లలో కాలిపోయిన వస్తువులకు నష్ట పరిహారం ఇప్పించాలని కాలనీ వాసులు కోరారు.