సంగారెడ్డి జిల్లాలో పరుపుల తయారీ గోదాంలో అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో పరుపుల తయారీ గోదాంలో అగ్నిప్రమాదం

అమీన్​పూర్​(పటాన్​చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని తేజ కాలనీలో పరుపుల తయారీ గోదాంలో  గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్​ సర్క్యూట్​ కారణంగా నిప్పంటుకొని నిమిషాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయి. గోదాంలో ఉన్న పరుపులు, సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. 

పటాన్​చెరు అగ్నిమాపక సిబ్బందితో పాటు పాశమైలారం పారిశ్రామిక వాడకు చెందిన రెండు ఫైర్​ ఇంజన్లు  వచ్చి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాయి. నివాసాల మద్య  ఇలాంటి కమర్షియల్​ కార్యకలాపాలు  నిర్వహించడంపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. పరుపుల తయారీ గోదాంకు ఎలాంటి అనుమతులు లేవని మున్సిపల్​ అధికారులు తెలిపారు.