కారుణ్య మరణం పొందిన తొలి వ్యక్తి

కారుణ్య మరణం పొందిన తొలి వ్యక్తి
  • కొలంబియాలో కారుణ్య మరణం

కొలంబియా: ‘మెల్లమెల్లగా ఒక్కొక్కరి వంతు వస్తుంది.. అందుకే నేను గుడ్​బై చెప్పడానికి బదులు త్వరలో కలుద్దామనే అంటా’.. కోర్టు పర్మిషన్​తో మరణాన్ని ఆహ్వానించే ముందు విక్టర్​ ఎస్కోబార్​ చెప్పిన చివరి మాటలివి! కొలంబియాకు చెందిన విక్టర్​ చాలాకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. డయాబెటిస్, గుండె జబ్బుతో ఆయన వీల్​చెయిర్​కే పరిమితం అయ్యాడు. ఇరవై నాలుగ్గంటలూ ఆక్సిజన్​ పైపు సపోర్ట్​ ఉండాల్సిందే! కండరాలు సంకోచించడం వల్ల తరచుగా విపరీతమైన బాధ కలుగుతుందని విక్టర్​ చెప్పారు. అరవై ఏండ్ల జీవితం చూశానని, అనారోగ్యం, నొప్పులతో ఇలా వీల్​ చెయిర్​లో జీవితం గడపడం కన్నా గౌరవంగా చనిపోవడమే మేలని అన్నారు. ముందుగా ఇంట్లో వాళ్లకు చెప్పి వాళ్ల మద్దతు కూడగట్టుకున్నడు. ఆపై కోర్టులో పిటిషన్​ పెట్టుకున్నడు. కొలంబియాలో 1997 వరకు యుథనేసియా(కారుణ్య మరణం) శిక్షార్హమైన నేరం.. ఆ తర్వాత మాత్రం ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ, ఆరు నెలలకు మించి బతికే అవకాశంలేని వాళ్లు కోర్టు పర్మిషన్​తో ఇలా చనిపోవచ్చని పేర్కొంది. ట్రీట్​మెంట్​ ద్వారా ఆరు నెలలకు మించి బతికే అవకాశం ఉన్నోళ్లకు ఇది వర్తించదని తెలిపింది. 2021 అక్టోబర్​లో ఈ రూల్ ను కూడా సడలించింది. ఆరు నెలలకు మించి బతికే అవకాశం ఉన్నప్పటికీ దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్నోళ్లు గౌరవంగా మరణించేందుకు ఓకే చెప్పింది. ఈ చట్ట సవరణ తర్వాత కోర్టు పర్మిషన్​తో కారుణ్య మరణం పొందిన తొలి వ్యక్తి విక్టర్​ ఎస్కోబార్. ఆయన విజ్ఞప్తిని, మెడికల్​ రికార్డులను పరిశీలించిన తర్వాత కోర్టు ఆయన కారుణ్య మరణానికి అంగీకరించింది. విక్టర్ ​కోరిక ప్రకారం ఈ తతంగాన్నంతా కెమెరాలో రికార్డు చేశారు. కుటుంబ సభ్యులు చూస్తుండగా డాక్టర్లు విక్టర్​కు తొలుత మత్తు మందు ఇచ్చి, ఆపై సైనేడ్ ను శరీరంలోకి ఇంజెక్ట్​ చేశారు.