ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో అనుభవంలో ఉన్నదే. ఇంటర్నెట్ యాక్సెస్విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫాంలైన వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తదితర యాప్లు చాలా మంది వినియోగిస్తున్నారు. వీటికి కోట్లలో సబ్స్కైబర్స్ఉన్నారంటే.. సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో చెప్పవచ్చు. అయితే తాజాగా వచ్చిన ఓ అధ్యయనం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ప్రపంచ జనాభాలో 60 శాతం కంటే ఎక్కువ మంది సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటున్నారని ఆ అధ్యయన సారాంశం.
డిజిటల్ అడ్వైజరీ సంస్థ కెపియాస్ తన క్వార్టర్లీ రిపోర్ట్లో ప్రచురించిన లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు బిలియన్ల కంటే ఎక్కువ మంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఇది గతేడాది కంటే 3.7 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. తూర్పు, మధ్య ఆఫ్రికాలో ప్రతి 11 మందిలో ఒకరు మాత్రమే వీటిని యూజ్ చేస్తుండగా.. ఇండియాలో ఈ సంఖ్య మూడింటిలో ఒకటిగా ఉంది. దీంట్లో గడిపే టైం కూడా రోజుకు 2 నిమిషాల నుంచి 2 గంటల 26 నిమిషాలకు పెరగడం దాన్ని ప్రభావం ఎంతలా ఉందో సూచిస్తోంది. ఇందులో మళ్లీ ప్రాంతాలను బట్టి తేడాలున్నాయి.
బ్రెజిల్లో రోజుకు సగటున 3 గంటల 49 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతుండగా, జపనీయులు తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. చాలా మంది ఎక్కువగా ఉపయోగిస్తున్న ప్లాట్ఫాంల లిస్టులో వాట్సప్, ఇన్స్టా గ్రామ్, ఫేస్బుక్ ఉన్నాయి.