పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్ఓపీ బ్లాక్లో పేషెంట్లకు ఆలస్యం కాకుండా అదనంగా 5 ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ ప్రొ. రాజారావు తెలిపారు. ఇటీవల గాంధీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా తలెత్తిన సాఫ్ట్వేర్ సమస్యలతో ఓపీ బ్లాక్ కంప్యూటర్ వ్యవస్థ పని చేయకపోవడంతో కంప్యూటరైజ్డ్ స్లిప్స్కు బదులుగా మాన్యువల్గా కాగితాలపై ఓపీ చిట్టీలు రాసి ఇస్తున్నారు. దీంతో పేషెంట్లు చాలా సేపు వేచి ఉండాల్సి వస్తుంది. దీనిపై స్పందించిన సూపరింటెండెంట్ పేషెంట్లకు స్లిప్స్అందించేందుకు మరో ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం గాంధీలో 20 బ్లాక్ఫంగస్ కేసులు, 58 కొవిడ్ పాజిటివ్ కేసులున్నాయని సూపరింటెండెంట్ తెలిపారు. ప్రతి రోజు ఐదుగురు కొవిడ్ పేషెంట్లు పూర్తిగా కోలుకొని డిశ్చార్జీ అవుతుండగా, మరో ఐదుగురు పేషెంట్లు అడ్మిట్ అవుతున్నారని చెప్పారు. డైట్ క్యాంటీన్ కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉందని, బుధవారం ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును కలిసి గాంధీ సమస్యలను వివరించామని, త్వరలో మంత్రి గాంధీ ఆస్పత్రిని సందర్శిస్తారని తెలిపారు.
గాంధీలో చిల్ర్డన్స్ డే
గాంధీ హాస్పిటల్ పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో సోమవారం డాక్టర్లు చిల్ర్డన్స్డే వేడుకలను నిర్వహించారు. చీఫ్గెస్ట్గా హాజరైన డీఎంఈ డా.కె.రమేశ్రెడ్డి కేక్ కట్ చేసి చిన్నారులకు గిఫ్ట్లను అందచేశారు. కార్యక్రమంలో గాంధీ సూపరింటెండెంట్ డా.రాజారావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా.ప్రకాశ్రావు, పీడియాట్రిక్ సర్జరీ హెచ్వోడీ డా. నాగార్జున, అసోసియేట్ ప్రొఫెసర్ డా.శ్రీనివాస్, ఫ్యాకల్టీ మెంబర్స్, పీజీ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.