బెంగాల్‌లో దారుణం.. ఒకే ఇంట్లో అనుమానాస్పదంగా అయిదుగురు మృతి

బెంగాల్‌లో దారుణం.. ఒకే ఇంట్లో అనుమానాస్పదంగా అయిదుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌లో ఆదివారం ఓ దారుణం వెలుగుచూసింది. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలోని జమాల్పూర్ గ్రామంలోని ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు సహా ఐదుగురు సభ్యులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను చూస్తే వారందరూ హత్యకు గురయ్యారనే అనుమానాలు కలుగుతున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

‘మృతులు హత్యకు గురైనట్లు కనిపిస్తోంది. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించాం. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించాం’ అని ఆయన తెలిపారు.

For More News..

గోవా సీఎం ఫోన్‌కు బెదిరింపు మెసెజ్..

కీసర తహశీల్దార్ నాగరాజు రూ. కోటి లంచం కేసులో మరో నిందితుడు సూసైడ్

తెలంగాణలో మరో 1,440 కరోనా కేసులు