ఉద్యమకారులను బలి తీసుకున్న కాంగ్రెస్ని బతకనియ్యద్దు

ఉద్యమకారులను బలి తీసుకున్న కాంగ్రెస్ని బతకనియ్యద్దు

కుత్బుల్లాపూర్ లోని దుండిగల్, గండిమైసమ్మ చౌరస్తాలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఉద్యమ కారుల మరణానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ పోస్టర్లు వెలిశాయి. దీంతో కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్ఓకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.  

ఫ్లెక్సీల్లో ఏముందంటే..

ఉద్యమకారులను బలి తీసుకున్న కాంగ్రెస్ ని తెలంగాణలో బతకనియ్యద్దు.. అని ఫ్లెక్సీల్లో రాసి దాని పక్కన తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి ఫోటోతో పాటు మరికొంతమంది ఉద్యమకారుల ఫోటోలను ఫ్లెక్సీల్లో పెట్టారు.