
హైదరాబాద్ లో టీఆర్ఎస్ - బీజేపీ మధ్య ఫ్లెక్సీల వివాదం నడుస్తోంది. ఇటివల నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసు ముందు సాలు దొర..సెలవు దొర.. కేసీఆర్ కు కౌంట్ డౌన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది బీజేపీ. దీంతో బీజేపీకి కౌంటర్ ఎటాక్ చేస్తోంది టీఆర్ఎస్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ మోడీకి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. జూలై 3న పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగస సభ నిర్వహిస్తోంది. దీంతో మోడీకి వ్యతిరేకంగా హోర్డింగ్ లు ఏర్పాటు చేస్తోంది టీఆర్ఎస్.
ఇక ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గాల సమావేశాలు, మోడీ సభ ప్రచారానికి టీఆర్ఎస్ చెక్ పెట్టింది. ప్రచారం కోసం యాడ్ ఏజెన్సీలను సంప్రదించిన బీజేపీ.. హోర్డింగ్స్ అన్నీ టీఆర్ఎస్ బుక్ చేసుకుందని తెలిసింది. దీంతో కేసీఆర్ ఫ్లెక్సీలతో హైదరాబాద్ గులాబీమయంగా మారిపోయింది. సిటీలోని హార్డింగ్స్, మెట్రో పిల్లర్స్ ను కేసీఆర్ ఫోటోలతో నింపేసింది టీఆర్ఎస్. ఇటు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా కేసీఆర్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయ్.
దీంతో భాగ్యనగరాన్ని కాషాయమయంగా మార్చే పనిలో పడింది బీజేపీ. నాంపల్లి బీజేపీ ఆఫీసు నుంచి సిటీ మొత్తం బీజేపీ జెండాలను ఏర్పాటు చేస్తోంది. నగరానికి బీజేపీ అగ్ర నేతలు తరలిరానున్నడంతో సిటీని కాషాయమయంగా మార్చేలా ప్లాన్ లో ఉంది బీజేపీ నాయకత్వం.