న్యూఢిల్లీ : లాడ్ డౌన్ ఎఫెక్ట్ ఫ్లైట్ తో ఫ్లైట్ చార్జీల మోత మోగనుంది. ఈ నెల 14 తర్వాత కేంద్రం లాక్ డౌన్ ఎత్తివేసినా… కొనసాగించినా ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఫ్లైట్ -చార్జీలు దాదాపు మూడు రెట్లు పెరగనున్నాయి. లాక్ డౌన్ తర్వాత కూడా విమానయ సంస్థలు ప్రయాణాల్లో సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి ఏవియేషన్ అధికారులు విమాన సంస్థలతో ఇప్పటికే చర్చలు జరిపారు. ఒక్క ఫ్లైట్ లో మూడో వంతు మంది ప్రయాణికులనే అనుమతించాలని నిర్ణయించారు. మూడు సీట్లున్న వరుస లో ఒక్క ప్రయాకుడికే అనుమతిస్తారు. ఈ కారణంగా చార్జీలను మూడు రెట్లు పెంచే అవకాశం ఉందని ఓ ఇంగ్లీష్ పేపర్ కథనంలో తెలిపింది. కరోనా ఎఫెక్ట్ తగ్గే వరకు విమాన ప్రయాణాల్లో సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయనున్నారు. చాలా విమాన సంస్థలు ఏప్రిల్ 14 తర్వాత బుకింగ్స్ ను ప్రారంభించాయి. కేంద్రం విమాన ప్రయాణాలకు అనుమతిస్తుందని ఆయా సంస్థలు దీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో రైల్వే బుకింగ్స్ పై స్పష్టత రావటం లేదు. ముందుగా ఈ నెల 15 నుంచి బుకింగ్స్ అనుమతిస్తామన్న రైల్వే ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుంది. లాక్ డౌన్ పై కేంద్రం నిర్ణయం తర్వాతే రైళ్లు నడపటం పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కరోనా కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో లక్షలాది మంది చిక్కుకుపోయారు. వారంతా రైళ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. రైళ్ల ప్రయాణాలు లేకుండా విమానాలను నడిపితే ప్రయాణికులపై పెద్ద ఎత్తున భారం పడనుంది. రైళ్లలో కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూ పరిమిత సంఖ్యలో ప్రయాణాలు అనుమతించాలని అధికారులు భావిస్తున్నారు.
ఫ్లైట్ చార్జీలు మూడు రెట్లు పెరిగే చాన్స్
- దేశం
- April 13, 2020
లేటెస్ట్
- వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య
- ఏపీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్.. చేతులు మారనున్న వేల కోట్లు!
- ప్రభుత్వ బ్యాంకుల నికర లాభం రూ.1.4లక్షల కోట్లు
- డబుల్ డిజిట్! .. మూడు పార్టీలదీ అదే ధీమా
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- అధికారంలో వస్తే జీఎస్టీ తొలగిస్తాం:రాహుల్ గాంధీ
- కాంగ్రెస్ సర్కార్.. 5 నెలలు టైమ్ పాస్ చేసింది: కేటీఆర్
- Aha OTT Top 10 Trending: సుడిగాలి సుధీర్ హోస్టింగే టాప్..ఆహా ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, షోస్ ఇవే
- బిల్డర్ చేతిలో మోసపోయిన భారత క్రికెటర్ తండ్రి
- Puri,Teja: తేజ సజ్జ, పూరి జగన్నాధ్ కాంబో.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!