పూణె వంతెన కూలి ఆరుగురు మృతి..ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

పూణె వంతెన కూలి ఆరుగురు మృతి..ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

పూణెలో ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరు(6)కు చేరింది. మరో 25 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన పూణె జిల్లాలోని కుందమాల గ్రామ సమీపంలో జరిగింది. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియా (పరిహారం) ప్రకటించింది. గాయపడిన వారికి చికిత్స ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. 

వంతెన కూలిన ఘటనపై మహారా ష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో సైప్రస్ ఉన్న ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. బాధితులకు సప్రమాదానికి గురైన ఈ వంతెన పాతదనీ దీని పరిస్థితి బలహీనపడటం, ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు వంతెన కూలిపోవడానికి కారణమై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.

ALSO READ | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..పూణెలో సమీపంలో కుప్పకూలిన వంతెన..పదుల సంఖ్యలో టూరిస్టులు గల్లంతు

పూణేలోని తలేగావ్ సమీపంలో ఇంద్రాయణి నదిపై వంతెన కూలిపోవడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సమీపంలో ఉన్న ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, అనేక మంది ప్రాణాలను కాపాడాయని అమిత్ షా ప్రశంసించారు.

కుండమాల గ్రామంలో విషాదం..

ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ఘటనతో మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని కుండమల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదంలో కుందమాలకు చెందిన ఆరుగురు మృతిచెందారు.. 25 మంది గాయపడ్డారు. అగ్నిమాపక స్థానిక అధికారులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఆరుగురు వ్యక్తులను రక్షించారు. ఎడతెగని వర్షం కారణంగా అధిక నీటి మట్టాలు ఉన్నప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.