
హైదరాబాద్: జర్మనీ నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానానికి ఆదివారం (జూన్ 15) సాయంత్రం బాంబు బెదిరింపులు వచ్చాయి. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన Lufthansa విమానం LH 752కు బాంబు బెదిరింపు రావడంతో అది తిరిగి ఫ్రాంక్ఫర్ట్కే మళ్లించారు.
ఈ ఘటన ఆదివారం (జూన్ 15, 2025) న సాయంత్రం జరిగింది. విమానం సుమారు రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టి తర్వాత బల్గేరియా గగనతలంలో ఉండగా వెనక్కి మళ్లించారు. హైదరాబాద్ విమానాశ్రయం అధికారులు ఈ బాంబు బెదిరింపు వార్తను ధృవీకరించారు.
ALSO READ | కేరళలో బ్రిటన్ యుద్దవిమానం ఎఫ్–35 ఎమర్జన్సీ ల్యాండింగ్
2025 ఫిబ్రవరి4న కూడా చెన్నై అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇది 274 మంది ప్రయాణికులతో ఫ్రాంక్ ఫార్ట్ కు బయల్దేరే ముందు గుర్తుతెలియన ఈ మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది.
ఇది సాధారణంగా జరుగుతున్న తప్పుడు బాంబు బెదిరింపులలో ఒకటిగా తెలుస్తోంది. భారత ప్రభుత్వం ,విమానయాన భద్రతా సంస్థలు ఇలాంటి బెదిరింపులను ఎదుర్కోవడానికి కట్టుదిట్టమైన భద్రతా ప్రోటోకాల్లను అమలు చేస్తున్నాయి.