మరికల్, వెలుగు : నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో 10/10 జీపీఏ సాధించిన పలువురు టెన్త్ స్టూడెంట్లను హైదరాబాద్ నుంచి చెన్నైకి ఉచితంగా శనివారం విమానంలో విహారయాత్రకు తీసుకెళ్లారు. స్థానిక ప్రతిభ హైస్కూల్ నుంచి నలుగురు, మాడ్గుల మండలం ఇర్విన ప్రభుత్వ పాఠశాలకు చెందిన ముగ్గురు స్టూడెంట్లకు నర్వ పీఏసీఎస్ అధ్యక్షుడు బంగ్లా లక్ష్మికాంత్రెడ్డి ఈ అవకాశం కల్పించారు.
చెన్నై లోని మెరీనా బీచ్, స్నేక్ పార్కు, ఐఐటీ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీతో పాటు పలు టూరిస్టు ప్రదేశాలను చూపించారు. దీంతో స్టూడెంట్లు సంతోషం వ్యక్తం చేశారు. ఎంఈవో సర్దార్నాయక్, జీహెచ్ఎం. విజయభాస్కర్రెడ్డి, టీచర్ హన్మంత్రెడ్డి కూడా వెళ్లారు.