జనాలను భయభ్రాంతులకు గురి చేసిన భారీ శబ్దం

జనాలను భయభ్రాంతులకు గురి చేసిన భారీ శబ్దం
  • పరిగి మండలం రంగాపూర్, రంగాపూర్ తాండాల్లో భారీ శబ్దం
  • భయభ్రాంతులకు గురై ఇళ్ళ నుండి బయటకు వచ్చిన జనాలు
  • ఏం జరిగిందనే అయోమయంలో గ్రామస్థులు
  • తుపాకీ పేల్చినట్టు శబ్దం వచ్చి భూమి కుదేసినట్టి అనిపించినట్టు చెబుతున్న జనాలు
  • భూకంపమా....మరేమిటని ఆరా తీసే పనిలో పడ్డ అధికారులు

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్, రంగాపూర్ తండాల్లో తెల్లవారుజామున భారీ శబ్దం జనాలను భయబ్రాంతులకు గురి చేసింది. ఉదయం ఏడు గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి భూమి కుదేసినట్లయ్యిందని స్థానికులు చెబుతున్నారు. భారీ శబ్దానికి భూమి రెండు సెకన్లపాటు కంపించిందని... దీంతో భయభ్రాంతులకు గురయ్యామని గ్రామస్థులు తెలిపారు. భారీ శబ్దానికి భయపడిన జనాలు ఏం జరిగిందోనని ఇళ్ళల్లో నుండి బయటకు వచ్చారు.

రంగాపూర్ గ్రామంతో పాటు రంగాపూర్ తాండాలో కూడా ఈ భారీ శబ్దం వచ్చి భూమి ప్రకపించినట్టు తెలుస్తోంది. తుపాకీతో పేల్చినట్టు శబ్దం వచ్చిందని... ఆ తర్వాత భూమి ఒక్కసారిగా కుదేసినట్టు అనిపించిందని గ్రామస్థులు తెలిపారు. భూ కంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. భూకంపం సంభంవించిన విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూకంపమా లేక మరేమిటనే అనే విషయం పై అధికారులు ఆరా తీస్తున్నారు.