బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ అనుచరులు

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ అనుచరులు

లింగంపేట, వెలుగు : ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ అనుచరులు ఒక్కొక్కరుగా బీఆర్​ఎస్​ను వీడుతుండడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ పార్టీ  ఖాళీ అవుతోంది. మాజీ ఎమ్మెల్యే సురేందర్​ ప్రధాన అనుచరులు వరుసగా పార్టీకి గుడ్​బై  చెబుతున్నారు. శనివారం లింగంపేట మాజీ ఎంపీపీ వడ్ల భీమయ్య, ఎల్లారెడ్డి మార్కెట్​కమిటీ వైస్​ చైర్మన్​ గజవాడ నరహరి, మాజీ జడ్పీటీసీ కొడుకు కమ్మరి వెంకటేశం

నాగిరెడ్డిపేట మండల సీనియర్​ లీడర్​ రాజ్​మోహన్​రెడ్డి కారు దిగి కమలం పార్టీలో చేరారు. జహీరాబాద్​ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్​సమక్షంలో వీరు బీజేపీలో చేరారు.  నాలుగు రోజుల క్రితం ఎల్లారెడ్డి మున్సిపల్​ చైర్మన్ కుడుముల సత్యం,తాడ్వాయి ఎంపీపీ కొండి రవి, ఆయా మండలాల  ఎంపీపీలు,జడ్పీటీసీమెంబర్లు,సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లు బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు.