షాకింగ్ న్యూస్: ఫుడీ బ్లాగర్ నటాషా దిడ్డి చనిపోయారు

షాకింగ్ న్యూస్: ఫుడీ బ్లాగర్ నటాషా దిడ్డి చనిపోయారు

ది గట్ లెస్ ఫుడీగా పేరున్న ఫుడీ బ్లాగర్ నటాషా దిడ్డీ ఆదివారం పుణెలో మృతిచెందింది. ఈ విషయాన్ని ఆమె భర్త బాధతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వృత్తిరీత్యా చెఫ్ అయిన నటాషా దిడ్డీ ఇటీవల కడుపులో కణితి రావడంతో ఆపరేషన్ చేసి పూర్తిగా పేగులు తీసేశారు. 

నటాషా గత 8ఏళ్లుగా అనేక రకాల వంటకాలు తయారు చేసి, వాటిని సంబంధించి ఆర్టికల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఆమె రిసిపీల ఆర్టికల్స్ కు నెటిజన్ ఫిదా అయిపోయి..లక్షల్లో ఫాలొవర్లుగా మారారు.అయితే ఈ ఫుడీ బ్లాగర్ 2019లో అనారోగ్యానికి గురికావడం.. కడుపులో కణిగి పెరగడంతో ఆమెకు ఆపరేషన్ చేసి కడుపు మొత్తాన్ని తొలగించారు డాక్టర్లు. అయితే మార్చి 24న(ఆదివారం )  నటాషా మరణించినట్లు ఆమె భర్త  ఇన్ స్టా గ్రామ్ లో తెలిపాడు. 

‘‘నా భార్య నటాషా దిడ్డీ మరణించింది. ఇది చాలా విచారణ కమైన వార్త.. ఎంతో బాధతో తెలియజేస్తున్నాను.. ఎందుకంటే ఆమె @the gurlessfoodie ఇన్ స్టా గ్రామ్ ఖాతా ఇంకా యాక్టివ్ గానే ఉంది.. ఎందరికో ఆమె రాసిన ఆర్టికల్స్ స్పూర్తినిచ్చాయి.. అలాంటి వారు ఎదురు చూస్తుంటారు.. అందుకే ఆమె మరణవార్తను బాధతో చెపుతున్నాను’’ అని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు.