నల్గొండ జిల్లా: దామరచర్ల మండలంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఫుడ్ పాయిజన్ కావటంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు డాక్టర్లు తెలిపారు. స్కూల్లో పెట్టే ఆహారం బాగోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంట సరిగా చేయడంలేదని, తినలేకపోతున్నామని వాపోయారు. తరచూ వాంతులవుతున్నాయని తెలిపారు. వంట చేసే వ్యక్తి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు చెబుతున్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకుని తమను వేధించకుండా చూడాలని కోరారు.
ఇవి కూడా చదవండి