హోటళ్లలో ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీ

హోటళ్లలో ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీ

ఖమ్మం రూరల్, వెలుగు : ఏదులాపురం మున్సిపాలిటీలో పలు హోటళ్లు, మొబైల్​ టిఫిన్​ సెంటర్లు, మిల్క్​ పార్లర్లపై ఫుడ్​ సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. అపరిశుభ్రమైన తినుబండారాలను, కుళ్లిపోయిన అల్లం, పాచిపోయిన చట్నీలను ధ్వంసం చేశారు. 

అపరిశుభ్రమైన కిచెన్, దుమ్ముదూళితో ఉన్న పైకప్పులు, గాలి, వెలుతురు లేకుండా గదులను గుర్తించారు. వరంగల్​ క్రాస్​రోడ్​లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఐదు టిఫిన్​ సెంటర్లు, రెండు మొబైల్​ టిఫిన్​ సెంటర్లు, రెండు మిల్క్​ పార్లర్లకు నోటీసులు ఇచ్చారు. ఫుడ్ హ్యాండ్లర్లు మాస్కులు, గ్లౌవ్స్, హెయిర్ కవర్లు లేకుండా పని చేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. 

రెండు హోటళ్ల నుంచి శాంపిళ్లు లేబోరేటరికీ పరీక్ష కోసం పంపించారు. తనిఖీల్లో ఫుడ్​ అధికారులు ఆర్ కిరణ్​కుమార్​, సీహెచ్​ లోకేశ్, శరత్, ల్యాబ్​ టెక్నిషియన్​ రతన్​రావు తదితరులు పాల్గొన్నారు.