కట్నం కోసం.. భార్యతో కలసి అత్తమామలను చంపిన అల్లుడు

కట్నం కోసం.. భార్యతో కలసి అత్తమామలను చంపిన అల్లుడు

కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కట్నం ఇవ్వలేదని అత్త, మామ లను అల్లుడే గొంతు కోసి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్వయంగా కూతురే తల్లిదండ్రులను చంపేందుకు భర్తకు సహకరించిన వైనం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.  గ్రామానికి చెందిన నెమలిబాబు 4 నెలల క్రితం మనీషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. మనీషా మైనర్ గా ఉన్నప్పటి నుండే నెమలి బాబు ఆమె వెంటపడి ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. పెద్దలకు ఇష్టం లేకున్నా మనీషాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది రోజులకే కట్నం కావాలంటూ మామ కోటా ముత్తయ్య ,అత్త సుగుణమ్మ లను వేధించడం మొదలుపెట్టాడు. ఇదే కోవలో నిన్న రాత్రి తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోద్రికుడైన నెమలిబాబు తన భార్య  మనీషా సహకారంతో అత్తా మామలను గొంతు కోసి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మనీషా ,నెమలి బాబులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.