
హైదరాబాద్, వెలుగు: ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల షెడ్యూల్ రిలీజ్ చేయాలనే డిమాండ్తో టీచర్లు పోరుబాట పట్టారు. జాక్టో, యూఎస్పీసీ గురువారం రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాకేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించాయి. 2018 జూన్2 నుంచి మధ్యంతర భృతి ఇస్తామని, ఆగస్టు15 నుంచి పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని జేఏసీ లీడర్లు డిమాండ్ చేశారు. వరంగల్లో జరిగిన దీక్షల్లో టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, భువనగిరిలో ప్రొఫెసర్ కోదండరాం, రంగారెడ్డి లో ఎమ్మెల్సీ రాంచందర్రావు, నల్గొండలో యూఎస్పీసీ నేత చావ రవి, హైదరాబాద్లో జాక్టో నేత సదానందంగౌడ్ తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకటించకపోతే ఈ నెల 29న హైదరాబాద్లో మహాధర్నా నిర్వహిస్తామని యూఎస్పీసీ లీడర్లు హెచ్చరించారు.