కొత్త, పాత తేడా లేకుండా పార్టీ కోసం..అందరూ కలిసి పనిచేయాలి

కొత్త, పాత తేడా లేకుండా పార్టీ కోసం..అందరూ కలిసి పనిచేయాలి

యాదాద్రి(బీబీనగర్​), వెలుగు : కొత్త, పాత తేడా లేకుండా అందరూ కలిసి పార్టీ కోసం పనిచేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి కార్యకర్తలకు సూచించారు. గురువారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్​కు చెందిన బీబీనగర్​ జడ్పీటీసీ గోలి ప్రణీతతోపాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరుతున్నారని తెలిపారు.

కాంగ్రెస్​ కార్యకర్తలతో సంప్రదింపులు చేసిన తర్వాతే ఇతర పార్టీల వారిని చేర్చుకుంటున్నామని చెప్పారు. కాంగ్రెస్​లో సీనియర్లకు గౌరవం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చేరికలు ప్రారంభం కాలేదన్నారు. పార్లమెంట్​ఎన్నికలతోపాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని అనిల్​కుమార్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సురకంటి సత్తిరెడ్డి, గోలి నరేందర్ రెడ్డి, పటోల్ల శ్యాంగౌడ్, పెంటయ్య, బాలకృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు.