కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతోంది. అయితే ఇది విదేశీ ప్రయాణికుల ద్వారానే వ్యాపిస్తోందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో విదేశీ ప్రయాణికులు విమానం దిగగానే వారి పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకుని… వారికి క్వారంటైన్ స్లిప్లు ఇచ్చి నేరుగా క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తోంది. ఈ కేంద్రాల దగ్గర ACP స్థాయి అధికారిని ఇంచార్జిగా నియమించారు.
వికారాబాద్, గచ్చిబౌలి స్టేడియం, ధూలపల్లి, నారాయణమ్మ కాలేజ్, అమీర్పేట నేచర్ క్యూర్ హస్పిటల్, రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీ, ఎంసీఆర్ హెచ్ఆర్డీ దగ్గర క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.