కామారెడ్డిలో చిరుత సంచారం

కామారెడ్డిలో చిరుత సంచారం

కామారెడ్డి: జిల్లాలోని రామారెడ్డి మండలం మద్దికుంట, రెడ్డిపేట గ్రామాల మధ్య ఉన్న నర్సరీ ప్రాంతంలో రెండు చిరుత పులులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు వారు మీడియాకు సమాచారం అందించారు. చిరుత పులులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు అధికారులు తెలిపారు. సమీప ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎవరూ కూడా ఆ ప్రాంతంలోకి రావొద్దని సూచించారు. ముఖ్యంగా మద్దికుంట, రెడ్డిపేట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వ్యవసాయదారులు, పశువుల కాపరులు అటువైపు వచ్చి ప్రమాదంలో పడొద్దని హెచ్చరించారు.

మరిన్ని వార్తల కోసం...

ఖరీఫ్ కోసం పంటల వారీగా క్లస్టర్లు

సామాన్యుడిపై పెట్రో బాదుడు