టీ కప్పులో తుఫాన్ లాంటిది.. కవిత ఇష్యూపై BRS మాజీ ఎమ్మెల్యే రాజయ్య రియాక్షన్

టీ కప్పులో తుఫాన్ లాంటిది.. కవిత ఇష్యూపై BRS మాజీ ఎమ్మెల్యే రాజయ్య రియాక్షన్

వరంగల్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం గులాబీ పార్టీతో పాటు అటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ హైకమాండ్‎పై ధిక్కార స్వరం వినిపిస్తోన్న కవిత.. త్వరలోనే కొత్త దుకాణం పెడతారంటూ పొలిటికల్ సర్కిల్స్‎లో ప్రచారం జరుగుతోంది. పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావును టార్గెట్ చేస్తూ పరోక్షంగా విమర్శలు చేస్తోన్న ఆమె.. తన తదుపరి కార్యచరణ ప్రకటించింది. శనివారం (మే 31) తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్ ప్రారంభించిన కేసీఆర్ తనయ.. జాగృతి కార్యకలాపాలను స్పీడప్ చేసి ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు.

 కేసీఆర్ బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్లలాంటివని కవిత చేసిన కామెంట్స్ రాజకీయా వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఇకపై బీఆర్ఎస్ కు సమాంతరంగా జాగృతిని నడిపిస్తానని కవిత చెప్పకనే చెప్పారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్ ఘన్‎పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. బీఆర్ఎస్‎తో కవిత గొడవ టీ కప్పులో తుపాన్ లాంటిదని పేర్కొన్నారు. ఆ ఇష్యూను పెద్ద హైలెట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. 

జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మొదటి నుంచి కవిత బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ దేవుడని.. ఆయనే తన అధినాయకుడని కవిత స్పష్టంగా చెప్పారని రాజయ్య గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి కవిత సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీ అధిపతి కేసీఆర్ కూతురు కావడంతో కవిత ఎపిసోడ్‎పై బీఆర్ఎస్ నేతలు ఆచీతూచీ వ్యవహారిస్తున్నారు. దాదాపు ఎవరూ పెద్దగా ఈ విషయంపై రియాక్ట్ కావడం లేదు. ఈ నేపథ్యంలో కవిత వ్యవహారంపై రాజయ్య స్పందించడం గమనార్హం.