
న్యూఢిల్లీ: సీబీఐ మాజీ డైరెక్టర్, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ అశ్వనీ కుమార్ హిమాచల్ ప్రదేశ్ షిమ్లాలోని ఆయన ఇంట్లో బుధవారం రాత్రి సూసైడ్ చేసుకున్నారు. అశ్వనీకుమార్ వయసు 69 ఏళ్ళు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. అశ్వనీ కుమార్ సూసైడ్ చేసుకున్నారని షిమ్లా ఎస్పీ మోహిత్ చావ్లా మీడియాకు వెల్లడించారు. ఆయన ఇంగ్లిష్లో రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్ ఆయన రాసిందేనని కుటుంబ సభ్యులు కన్ఫమ్ చేశారని చెప్పారు. జీవితంలో ఇక చేయాల్సిందేమీ లేదన్నంతగా ఆయన డిప్రెషన్ లో ఉన్నారని, అందుకే కొత్త జర్నీని ప్రారంభిస్తున్నట్లుగా అందులో రాశారని తెలిసింది. అశ్వనీ కుమార్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆ రాష్ట్ర డీజీపీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సీబీఐ డైరెక్టర్గా నియమితులయ్యారు. నాగాలాండ్, మణిపూర్లకు గవర్నర్ గా పనిచేశారు.