మెదక్ ఎంపీ స్థానం బీజేపీదే : రఘునందన్ రావు

మెదక్ ఎంపీ స్థానం బీజేపీదే : రఘునందన్ రావు

నర్సాపూర్, వెలుగు: మెదక్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంటు పరిధిలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఈనెల 24న బీజేపీ పార్టీ నిర్వహిస్తున్న విజయ సంకల్పయాత్ర కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని మోదీ చేసిన అభివృద్ధితో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, బీజేపీని గెలిపించడానికి  సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పార్లమెంటరీ ప్రబారి బసవ లక్ష్మీనరసింహ, బీజేపీ కార్యవర్గ సభ్యుడు మురళి యాదవ్  పాల్గొన్నారు.