Yusuf Pathan: రాజకీయ అరంగ్రేటం.. ఎంపీగా పోటీచేస్తున్న భారత క్రికెటర్

Yusuf Pathan: రాజకీయ అరంగ్రేటం.. ఎంపీగా పోటీచేస్తున్న భారత క్రికెటర్

భారత మాజీ క్రికెటర్, ఇర్ఫాన్ పఠాన్ సోదరుడు యూసుఫ్ పఠాన్ రాజకీయ అరంగ్రేటం చేయనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తరుపున ఎంపీగా పోటీ చేయనున్నారు. బహరంపూర్ పార్లమెంట్ స్థానం తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

రాబోయే లోక్‌సభ ఎన్నికల 2024 కోసం తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఆదివారం 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆ జాబితాలో యూసుఫ్ పఠాన్ పేరుంది. యూసుఫ్ పఠాన్ ఇవాళే మ‌మ‌త బెన‌ర్జీ స‌మ‌క్షంలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్‌క‌తాలోని బ్రిగేడ్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించిన మెగా ర్యాలీలో ప‌ఠాన్.. టీఎంసీ కండువా క‌ప్పుకున్నారు. అతడు తృణమూల్ అభ్యర్థిగా అధిర్ రంజన్ చౌదరిపై పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.