ఇమ్రాన్ ఖాన్ కు సెహ్వాగ్ దిమ్మతిరిగే కౌంటర్

ఇమ్రాన్ ఖాన్ కు సెహ్వాగ్ దిమ్మతిరిగే కౌంటర్

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.   ఐక్యరాజ్యసమితి 74వ సమావేశాల్లో ఇమ్రాన్ ఖాన్ భారత్ పై విషం చిమ్మారు. భారత్ తో యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆర్టికల్ 370పై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. కశ్మీర్ లో కర్ఫ్యూ కొనసాగిస్తున్నారని, తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత్ కు చెందిన పలువురు క్రికెటర్లు ఘాటుగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు  రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా ఉన్నాయని, ఇటువంటి మాటలు తగవని హితువు పలికారు.

ఇమ్రాన్ భారత్ తో మర్యాద..మర్యాద

తాజాగా ఇమ్రాన్ వ్యాఖ్యలపై సెహ్వాగ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇమ్రాన్ అమెరికా వార్తా ఛానల్ ఎంఎస్ ఎస్ బీసీ తో మాట్లాడిన వీడియోను ట్వీట్ చేసిన సెహ్వాగ్..తనను కించపరుచుకునేందుకు కొత్త మార్గాలు కనిపెట్టారంటూ  వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్‌ పనికిమాలిన ప్రసంగం చేశారని, ఆయన తనకు తానుగా అవమానించుకున్నారనే అర్థం వచ్చేలా సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు.