కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఊమెన్ చాందీ మే 05 శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. వైరల్ న్యుమోనియా కారణంగా ఆయన బెంగుళూరులోని హెచ్సిజి క్యాన్సర్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చాందీ ఊమెన్ ఫేస్బుక్ లో వెల్లడించారు.
సందర్శకులకు అనుమతి లేదని, ప్రతి ఒక్కరూ తన తండ్రి త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేయాలని చాందీ ఊమెన్ పేర్కొన్నారు. కేరళ రాష్ట్రానికి ఊమెన్ చాందీ రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004 - 2006 మధ్య ఆయన తొలిసారిగా సీఎం బాధ్యతలు చేపట్టారు. ఇక 2011 - 2016 మధ్య రెండోసారి ముఖ్యమంత్రిగా అయ్యారు.