కాంగ్రెస్​తోనే అభివృద్ధి సాధ్యం : పి.సుదర్శన్​రెడ్డి

కాంగ్రెస్​తోనే అభివృద్ధి సాధ్యం : పి.సుదర్శన్​రెడ్డి

బోధన్, వెలుగు :  కాంగ్రెస్​తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి, బోధన్​ అభ్యర్థి పి.సుదర్శన్​రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బోధన్​ మండలంలోని భవానీపేట్, సంగెం, మినార్​పల్లి గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్​రెడ్డి మాట్లాడుతూ పదేండ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్​ ప్రజలను మోసం చేశారని వాపోయారు.

గ్రామాల్లో పర్యటిస్తుంటే ఇందిరమ్మ ఇండ్లే దర్శనమిస్తున్నాయని, డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు ఎక్కడ కట్టారని ప్రశ్నించారు. బోధన్ లోని పలు వార్డుల్లో  మున్సిపల్​ చైర్​పర్సన్​ తూము పద్మావతి ప్రచారం చేశారు.