బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. గుండె, మూత్రపిండ సంబంధమైన సమస్యలతో ఈ మధ్యాహ్నం ఆయన ఆస్పత్రిలో చేరారు. వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. మెడికల్ చెకప్ కోసం కార్డియాలజీ విభాగంలో చేరినట్లు డాక్టర్లు తెలిపారు.
గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. గతేడాది ఆయన కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. జైట్లీని పరామర్శించేందుకు ప్రధాని మోడీ ఎయిమ్స్ కు చేరుకున్నారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ సా, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రి అశ్వని చౌబే, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఎయిమ్స్ కు చేరుకున్నారు.