కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇవాళ(శనివారం) చనిపోయారు. కొద్ది రోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. కొందరితో కలిసి ఒకే కారులో ప్రయాణించడంతో తనకు కరోనా సోకిందని తెలిపారు. పది రోజుల కిందట మాణిక్యాలరావుకు కరోనా సోకగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి మాణిక్యాల రావు విజయం సాధించారు. చంద్రబాబు ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో బీజేపీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధి కోసం పని చేసి.. చివరి వరకూ అదే పార్టీలో కొనసాగారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.