బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి : మాజీ మంత్రి రవీంద్రనాయక్

బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి : మాజీ మంత్రి రవీంద్రనాయక్

బషీర్ బాగ్, వెలుగు: దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు చెప్పేదొకటి.. చేసేదొకటని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ విమర్శించారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  

ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేశామని గొప్పలు చెప్పే బీజేపీ నేతలు, రాష్ట్రపతిని పార్లమెంటు భవనం, రామ మందిరం ప్రారంభోత్సవాలకు ఆహ్వానించకుండా అవమానించారని మండిపడ్డారు.  బీజేపీ రాష్ట్ర పార్టీలో.. కేంద్ర పార్టీలో గిరిజనులకు స్థానమెందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఈబీసీ జాతీయ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.