శ్రీనివాసగౌడ్ ఆఫీసు నుంచి ఫర్నిచర్ తరలింపు : అడ్డుకున్న ఓయూ స్టూడెంట్స్

శ్రీనివాసగౌడ్ ఆఫీసు నుంచి ఫర్నిచర్ తరలింపు : అడ్డుకున్న ఓయూ స్టూడెంట్స్

మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ కు సంబంధించి.. హైదరాబాద్ సిటీలోని రవీంద్రభారతిలో మంత్రి హోదాలో పేషీ ఉంది. ఈ పేషీలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర వస్తువులను డిసెంబర్ 6వ తేదీ బుధవారం ఉదయం.. రెండు ట్రాలీల్లో తరలిస్తుండగా.. ఓయూ విద్యార్థి సంఘం నేతలు, ఇతర స్టూడెంట్స్ అడ్డుకున్నారు.

ప్రభుత్వానికి సంబంధించిన వస్తువులను ఎలా తరలిస్తారంటూ నిలదీశారు. ట్రాలీలను అడ్డుకున్నారు. శ్రీనివాసగౌడ్ మనుషులు.. అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘం నేతలు ధర్నాకు దిగారు. సైఫాబాద్ పోలీసుస్టేషన్ లో కంప్లయింట్ కూడా చేయటం విశేషం. 

నాంపల్లిలోని టీజీవో భవన్ కు ఈ ఫర్నీచర్ ను ట్ర్యాలీ డ్రైవర్ తరలిస్తున్నట్లు తెలిపారు. లోడ్ లో ఏసీ, ఫర్నిచర్, కంప్యూటర్స్, పలు ఫైల్స్ ను తరలించినట్లు స్టూడెంట్స్ గుర్తించారు.