కాంగ్రెస్​లోకి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి

కాంగ్రెస్​లోకి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి

షాద్ నగర్, వెలుగు: షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సొంత గూటికి చేరుకున్నారు. శుక్రవారం ఆర్మూర్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతాప్ రెడ్డితో పాటు జడ్పీటీసీలు వెంకట్రామి రెడ్డి, తాండ్ర విశాల, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు కాంగ్రెస్ లో చేరారు. షాద్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా రాహుల్ వారికి సూచించారు.