మంత్రి ఈటలను కలిసిన మాజీ ఎమ్మెల్యేలు

మంత్రి ఈటలను కలిసిన మాజీ ఎమ్మెల్యేలు

అసెంబ్లీ‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ని మాజీ శాసన సభ్యులు కలిశారు. మాజీ శాససభ్యులకు వైద్య ఖర్చులు ఇచ్చేందుకు, పెన్షన్లు పెంచేందుకు చొరవ తీసుకున్నందుకు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శాసన సభ్యులు, మాజీ శాసన సభ్యులు ఆసుపత్రికి వెళ్లినప్పుడు చికిత్సకు సంబంధించిన బిల్లుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. శాసన సభ్యులు వారి యొక్క భార్య లేదా భర్త చికిత్స కోసం పది లక్షలు ఖర్చు పెట్టేలా బిల్లు పెట్టారు. సకాలంలో చికిత్స తీసుకునే విధంగా శాసన సభ్యులకు, మాజీ శాసన సభ్యులకు వారి భార్య లేదా భర్తకు ఇది వర్తిస్తుంది. మాజీ శాసన సభ్యులకు సంబంధించిన కనీస పెన్షన్ 30 వేల నుంచి 50 వేల వరకు.. అప్పర్ సీలింగ్ 75 వేల వరకు ఈ బిల్లులో పెట్టడం జరిగింది. మంత్రిని కలిసిన వారిలో రాజేశం గౌడ్, ఆంజనేయులు, డాక్టర్ లింగయ్య, గుజ్జుల రామకృష్ణ రెడ్డి, సుద్దాల దేవయ్య ఉన్నారు.