ఆశావర్కర్లకు అండగా కాంగ్రెస్ : భూపతిరెడ్డి

ఆశావర్కర్లకు అండగా కాంగ్రెస్ : భూపతిరెడ్డి

మోపాల్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే ఆశావర్కర్లకు కాంగ్రెస్​అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం శనివారం మోపాల్​ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్​ ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్​సొర్సింగ్​ఉద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధరణి అవలంబిస్తోందని, వారు రోజుల తరబడి ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.

కాంగ్రెస్​అధికారంలోకి రాగానే ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చి, వారికి న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లీడర్లు ముప్ప గంగారెడ్డి, సాయిరెడ్డి పాల్గొన్నారు.