పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు..?

పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు..?

టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతి, ప్రజావ్యతిరేక పాలన సాగుతోందన్నారు. లిక్కర్, భూముల ధరలు పెంచి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులను ప్రోత్సహించి యువతను తాగుబోతులుగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

నారాయణపేట జిల్లా ఎక్లాస్ పూర్ లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ‘ప్రజాగోస..బీజేపీ భరోసా బైక్ ర్యాలీ’ని ప్రారంభించారు. బైరంకొండ, జలాల్ పూర్, పెరపళ్ల, సింగారం, అప్పంపల్లి మీదుగా ర్యాలీ సాగింది. పాలమూరు ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకుని.. నిర్మాణం పూర్తి చేస్తానన్న కేసీఆర్ కు ఇప్పటివరకు కుర్చీ దొరకడం లేదా..? అని ప్రశ్నించారు.