
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మొత్తం సొంత పొగడ్తలకే సరిపోయిందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ. అమరవీరులను ఒక్కరిని కూడా గుర్తు చేసుకోలేదని అన్నారు. మూసీ కాలువలో మురికి ఎంత ఉందో టీఆర్ఎస్ పార్టీలో అవినీతి అంత ఉందన్నారు. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఆత్మహత్యలు ఆగలేదని, నిరుద్యోగ యువత పరిస్థితి అత్యంత దారుణంగా తయారయిందని అన్నారు. ఆత్మహత్యల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని... అయినా కేసీఆర్ కు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారడంలో కేసీఆర్ చేసిన కృషి ఏమీ లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు వస్తాయనుకుంటే .. గొర్రెలు, బర్రెలు ఇస్తామని కేసీఆర్ అంటున్నారని విమర్శించారు. రాహు కాలం.. రావుల కాలంలో ఏమీ రావన్నట్లుందన్న మధు యాష్కీ.. ఇక TRS కు వీఆర్ఎస్ పలకాల్సిన సమయం వచ్చిందన్నారు.